క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత టాప్ వెటరన్ స్పిన్నర్

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన  భారత టాప్ వెటరన్ స్పిన్నర్

ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్. 1998 లో భారత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన హర్భజన్ 2016 మార్చ్  లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి భారత జట్టులో స్థానం దక్కలేదు.‘ నా ఇంటర్నేషనల్ క్రికెట్ వీడ్కోలు చెబుతున్నా.. ఈ 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని అద్భుతంగా ,చిరస్మరణీయంగా మారడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ’ ట్విట్ చేశాడు.  41 ఏళ్ల హర్భజన్ 103 టెస్టులు ఆడి 417 వికెట్లు,236 వన్డేల్లో 269 వికెట్లు,28 టీ20ల్లో25 వికెట్లు తీశాడు. మూడు ఫార్మట్లాలో 3570 పరుగులు తీశాడు.  ఐపీఎల్ లో ముంబై,కోల్ కతా, చెన్నై తరపున ఆడి 150 వికెట్లు తీశాడు.