పీఎస్‌కు క్యూ కడుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల బాధితులు

పీఎస్‌కు క్యూ కడుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల బాధితులు

 మరిపెడ(చిన్న గూడూరు), వెలుగు: మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలో నిర్మించిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం డబ్బులు చెల్లించిన బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. బీఆర్ఎస్ ​లీడర్లను నమ్మి మోసపోయామంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. ‘డబుల్​ఇండ్లు ఇప్పిస్తమని ఒక్క ఊర్లనే రూ.2కోట్లు వసూలు’ పేరుతో బుధవారం ‘వెలుగు’లో స్టోరీ పబ్లిష్​అయింది. దాన్ని చూసిన బాధితులు డబ్బు చెల్లించిన ఆధారాలతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉదయం చిన్నగూడూరు గ్రామానికి చెందిన వేముల దుర్గమ్మ అనే మహిళ మహిళ చిన్నగూడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్​లీడర్ ధారా సింగ్ కు తాను డబుల్​బెడ్​రూమ్​ఇల్లు కోసం రూ.1,65,000 ఇచ్చానని చెప్పింది. ఫోన్ పే స్క్రీన్​షాట్లను పోలీసులకు అందజేసింది. ఇల్లు ఇవ్వకుంటే, తన డబ్బులు వాపస్ ఇప్పించాలని కోరింది.