వీడియో: పార్కింగ్ గొడవ.. మహిళపై డాక్టర్ దాడి

వీడియో: పార్కింగ్ గొడవ.. మహిళపై డాక్టర్ దాడి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మహిళపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. నలుగురు కలిసి మహిళను చితక్కొట్టారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గురువారం సాయంత్రం భన్వర్కువాన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. ఓ మహిళ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతోంది. అక్కడే పార్క్ చేసిన కారు యజమాని డాక్టర్ కు ఆమెకు పార్కింగ్ విషయంలో వాగ్వాదం జరిగింది. కాసేపటికి ఆ డాక్టర్ తన క్లినిక్ నుంచి తన సిబ్బందిని పిలిపించుకున్నాడు. కూరగాయలు అమ్మే ద్వారకా బాయిని , ఆమె కుమారుడు రాజును కొట్టించాడు. ఆమె బంగాళదుంపల్ని ఉల్లిపాయల్ని పారవేస్తూ వాళ్లను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే తోపుడు బండి ముందు పార్క్ చేసిన కారును తరలించమని డాక్టర్‌ని కోరినందుకే వారు దాడికి దిగారని  ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.