
దూర ప్రాంతాలకు.. పర్యాటక ప్రాంతాలకు వెళ్లేటప్పుడు చాలామంది కలసి వెళతారు. నదీ తీరంలోనో.. చెట్ల మధ్యలోనో ఎంజాయి చేస్తారు. అప్పుడు అందరూ గుమికూడి.. కబుర్లు చెప్పుకోవడం.. తినుబండరాలు తినడం.. ఇంకా వారు అనేక విషయాలు చర్చించుకుంటారు. ఈలలు.. అరుపులు.. పాటలు.. ఆటలతో ఫుల్కుషీ గా ఉన్న గ్రూప్ లో కొంతమంది షడన్బిగ్గరగా అరుస్తూ పరిగెత్తారు.
ఓ నది దగ్గర ఎంజాయిమెంట్ దగ్గర ఎంజాయిమెంట్ చేసి భోం చేస్తున్న సమయంలో .. అక్కడ ఓ పెద్ద ఏనుగు ప్రత్యక్షమయింది. ఇక అంతే జనాలు బిగ్గరగా అరుస్తూ పరారయ్యారు. అక్కడ వస్తువులు చెల్లచెదరు అయ్యాయి. ఆ ప్రాంతానికి ఏనుగు అనుకోని అతిథిగా వచ్చి జనాలను భయాందోళనలకు గురి చేసింది.
జనాలు అరుస్తూ పరిగెత్తడం.. ఏనుగు రావడం భయంకరంగా ఉన్న ఆందోళనగా ఉన్న సన్నివేశాన్ని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నదీ ఒడ్డున పర్యాటకులు ఉన్న సమయంలో ఏనుగు రావడంతో ప్రశాంతంగా ఉన్న పిక్నిక్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.
Tell me whose mistake it is. Why to chose location for picnic where the elephants are moving usually. In search of beautiful location please don’t put life in danger. pic.twitter.com/heteJAk0rt
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 13, 2025
ఎంజాయిమెంట్ మూడ్ లో ఉన్న సందర్శకులు పెద్ద ఏనుగును చూసిన తరువాత వేగంగా పరిగెత్తారు. ఓ మహిళ అలా పరిగెత్తవద్దు.. ఏనుగు వెంబడిస్తుంది అని అరిచింది. దీంతో కొంతమంది
పెద్ద పెద్ద రాళ్లు.. కర్రలు పట్టుకొని ఏనుగును వెంబడించారు. పరిగెడుతున్న వారిని చూసి భయపడిందేమో తెలియదు కాని వాగును దాటి నడచుకుంటూ అడవుల్లోకి వెళ్లింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అధికారి ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్.. ఏనుగులు.. వన్యమృగాలు తరచుగా వచ్చే ప్రదేశాన్ని పిక్నిక్ స్పాట్ గా ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. అందమైన ప్రదేశాల కోసం ఇంటర్ నెట్ లో సెర్చ్ చేస్తూ.. జీవితాలతో ఆడుకోకండి అని కామెంట్ చేశారు.
పర్యావరణాల మధ్య జంతువుల వలసలకు అడవి ప్రదేశాలు.. నదీతీరాలు ప్రాంతాల నుంచి వెళుతుంటాయి. అలాంటి ప్రదేశాల్లో జనాలు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎంజాయిమెంట్పేరుతో వన్యప్రాణుల జీవన విధానానికి ఆటంకం కలిగించవద్దని .. వాటి కారిడార్లను గౌరవించాలని సూచించారు. ఇలాంటి ప్రాంతాల్లో పిక్నిక్లు... పార్టీలు వన్యప్రాణులను ఒత్తిడికి గురి చేస్తాయనారు. పర్యాటకులను.. వన్యప్రాణులను ప్రమాదానికి గురిచేసే పరిస్థితులు ఏర్పడుతాయని ఫారెస్ట్ అధికారి తెలిపారు.