పూరీ జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. వరస విషాదాలు నాటి హెచ్చరికనా.. విమాన ప్రమాదం దేనికి సంకేతమా..?

పూరీ జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. వరస విషాదాలు నాటి హెచ్చరికనా.. విమాన ప్రమాదం దేనికి సంకేతమా..?

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో విమానం ప్రమాదం.. వందల మంది చనిపోయారు.. ఇదే కాదు.. రెండు నెలలుగా దేశంలో ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ రెండు నెలల క్రితమే దేవుడు సంకేతం ఇచ్చాడు.. ఘోరమైన విషాధాలు జరుగుతాయని దేవుడి సూచించాడా.. అవును ఇప్పుడు ఇదే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోట ఇదే వినిపిస్తుంది.. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఈ విషయాన్నే చర్చించుకుంటున్నారు. కారణం ఏంటీ.. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం..

ALSO READ | అహ్మదాబాద్ విమాన ప్రమాదం..డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) దొరికింది

జగన్నాథ ఆలయంపై పక్షులు ఎగరవు. ఆలయంపైకి పక్షులు వెళ్లవు. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్న. ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోయారు. ఇలాంటి విశిష్ఠత ఉన్న జగన్నాథుని ఆలయం గరుడ పక్షి.. గద్ద ఎగిరింది. ఆలయం గోపురం గద్ద వాలింది. అంతే కాదు.. గోపురంపై ఎంతో విశిష్ఠతగా చూసే జెండాను తెంపుకుని వెళ్లింది గద్ద. ఆలయంపై పక్షులే ఎగరవు.. అలాంటిది.. 2025, ఏప్రిల్ 13వ తేదీన ఓ గద్ద.. గోపురంపై జెండా ఎత్తుకెళ్లింది. అప్పట్లోనే ఇది పెద్ద సంచలనం అయ్యింది. ఎంతో మంది పండితులు దీన్ని అపశకునంగా భావించారు. మరికొందరు దీన్ని కొట్టిపారేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న వరస ఘటనలతో.. ఇప్పుడు విమాన ప్రమాదంతో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది.

 

2025, ఏప్రిల్ 13వ తేదీన పూరీ జగన్నాథుని ఆలయంపై గద్ద ఎగరటం.. గోపురంపై జెండాను ఎత్తుకెళ్లటం అనేది అపశకునంగా భావించటానికి ఇప్పటి ఉదాహరణలే సాక్ష్యం అంటున్నారు ఒడిశా జనం. ఆ తర్వాతనే కదా పహల్గాం దాడి జరిగింది.. పాకిస్తాన్ దేశంతో వివాదం వచ్చింది.. ఆ తర్వాతనే కదా బెంగళూరులో తొక్కిసలాట జరిగిన క్రికెట్ అభిమానులు చనిపోయింది.. ఆ తర్వాతనే ముంబైలో రైలు ప్రమాదం.. ఇప్పుడు విమాన ప్రమాదం.. ఇవన్నీ విపత్తులు కాదా.. పూరీ జగన్నాథుని సంకేతం కాదా అంటున్నారు. 

 

పూరీ జగన్నాథుని ఆలయంపై ఎగిరే జెండాకు ఎంతో విశిష్ఠత ఉంది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు జెండాను మారుస్తారు. ఆలయం శిఖరంపై ఎగురుతున్న ఈ జెండాను భక్తులు దర్శనానికి వెళ్లే ముందు చూసి నమస్కరించడం ఆనవాయితీ. ఈ జెండాను గాలికి వ్యతిరేక దిశలో ఎగురవేస్తారు, ఇది ఒక రహస్యం. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి గోపురంపై పక్షులు ఎగరవు.. వాలవు.. అలాంటిది గద్ద వచ్చింది.. గోపురంపై జెండాను లాక్కుని వెళ్లింది. ఇలా జరిగితే అది రాబోయే విపత్తులకు సంకేతం.. జరగబోయే ఘోరాలకు సూచికగా భావిస్తారు ఒడిశా జనం.. 

ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదం ఒక్కటే కాదు.. విమాన ప్రమాదం జరిగిన రోజే.. పూరీ జగన్నాథుని ఆలయ పూజారి కూడా హత్యకు గురవ్వటం అనేది చాలా పెద్ద అంశంగా.. తీవ్రమైనదిగా భావిస్తున్నారు ఒడిశా జనం. దేశంలో వరసగా జరుగుతున్న ప్రమాదాలు, విషాదాలు, విపత్తులకు కారణం పూరీ జగన్నాథుని ఆలయంపై జెండాను గద్ద ఎత్తుకెళ్లటమే అని.. ఇది దేవుడి సంకేతం అని అంటున్నారు. సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.