ఇండియా, పాకిస్తాన్ మధ్య వార్ బ్యాక్డ్రాప్లో ‘ఘాజీ అనే సబ్ మెరైన్ బ్యాక్డ్రాప్ సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆ తర్వాత తీసిన మరో ప్రయోగాత్మక చిత్రం ‘అంతరిక్షం’ మెప్పించలేకపోయింది. ఇప్పుడు మూడో సినిమాగా ‘ఐబి 71’ తెరకెక్కించాడు. విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించిన ఈ హిందీ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు.
‘ఘాజీ’ తరహాలోనే ఇది కూడా యాభై ఏళ్ల క్రితం ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఓ సీక్రెట్ మిషన్కు సంబంధించిన స్టోరీ. దేశాన్ని రక్షించడం కోసం 1971లో ముప్ఫై మంది ఇండియన్ ఏజెంట్స్, పాకిస్తాన్ వెళ్లి పది రోజుల్లో ఓ మిషన్ను ఎలా కంప్లీట్ చేశారనేది కథ. అనుపమ్ ఖేర్, విశాల్ జేత్వ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించాడు. మరి ‘ఘాజీ’ తరహాలో మరోసారి సంకల్ప్ మెప్పిస్తాడేమో చూడాలి!