చెన్నై: తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. 2015 –-16 ఆర్థిక సంవత్సరంలో తన పూర్తి ఆదాయాన్ని వెల్లడించలేదన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ. 1.50 కోట్ల జరిమానాను సవాలు చేస్తూ విజయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 2016 -–17 ఆర్థిక సంవత్సరానికి విజయ్తన రూ.35.42 కోట్ల ఆదాయాన్ని ప్రకటించారు.
అయితే, 2015లో అతని నివాసంలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా.. ‘పులి’ అనే తమిళ చిత్రం నుంచి సంపాదించిన రూ.15 కోట్ల ఆదాయాన్ని అతను వెల్లడించలేదని ఆ శాఖ ఆరోపించింది. అనంతరం 2022 జూన్ 30 న రూ. 1.50 కోట్ల జరిమానా విధించింది. దానిని సవాలు చేస్తూ విజయ్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి తీర్పు వెలువరించారు.
