నిర్మల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

నిర్మల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

నిర్మల్ జిల్లాలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. దివ్యానగర్ తన్వి అపార్ట్ మెంట్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ చందర్ దేశ్ పాండేను ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా..వారిని బెదిరించారు. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితులు హైదరాబాద్ రూట్లో  వెళ్లినట్లు స్థానికులు చెప్పడంతో.. ఆ మార్గంలోని పోలీసులను అలెర్ట్ చేశారు. ఇందళ్ వాయి టోల్ ప్లాజా దగ్గర ఒక వాహనాన్ని, తూప్రాన్ దగ్గర మరో వాహనాన్నిగుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డికి చెందిన కృష్ణారావు ప్రధాన నిందితుడుగా  డీఎస్పీ ఉపేంద్రా రెడ్డి తెలిపారు.