
విమానం హైజాక్ అనగానే.. వెంటనే గుర్తొచ్చేది 1999లో జరిగిన కాందహార్ హైజాగ్ ఇన్సిడెంట్. దీని స్ఫూర్తితో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ఇది జరిగి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా ఇప్పుడో వెబ్ సిరీస్ వస్తోంది. ‘ఐసి 814: ది కాందహార్ హైజాక్’ పేరుతో అనుభవ్ సిన్హా దీన్ని తెరకెక్కించారు. విజయ్ వర్మ, అరవింద్ స్వామి, పంకజ్ కపూర్, నసీరుద్దీన్ షా ముఖ్యపాత్రలు పోషించారు.
తాజాగా ఈ సీరీస్ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆగస్ట్ 29 నుంచి నెట్ఫ్లిక్స్ ఒరిజినల్గా స్ట్రీమింగ్కి వస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్లో..ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న వారి ఫొటోలతో పాటు వారు చెప్పిన డైలాగ్స్తో హైజాక్ ఘటన తీవ్రత చూపించారు.
ట్రైలర్ చూస్తే..
ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ ఐసీ 814 విమానం కెప్టెన్ శరణ్ దేవ్ గా నటించాడు. ఈ ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ మాట్లాడుతూ.."డిసెంబర్ 24, 1999లో జరిగిన ఆ భయానక హైజాక్ ఘటన మన చరిత్రలోనే చీకటి రోజుగా నిలిచిపోయినట్లుగా" అన్నారు. అలాగే ఇందులో ఎడిటర్ షాలిని చంద్రగా నటించిన దియా మీర్జా..'ఇది కేవలం ఒక్క విమానం హైజాక్ కాదు..మొత్తం దేశం హైజాక్ అంటూ" ఇంటెన్స్ పెంచేసింది.
రా జాయింట్ సెక్రటరీ రంజన్ మిశ్రాగా నటుడు కుముద్ మిశ్రా కనిపించగా..'ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రాణాలను కాపాడటం ఒకెత్తయితే..హైజాకర్లను డిమాండ్లను నెరవేర్చడం మరో సవాలని' చెప్పటం ఆలోచింపజేస్తుంది. ఇక టీజర్ చివర్లో స్టార్ హీరో అరవింద్ స్వామి.. విదేశాంగ శాఖ సెక్రటరీ శివరామకృష్ణన్ పాత్రలో నటించగా ..''తమ పోరాటం శత్రువులతోనే కాదు..క్షణక్షణం గడిచిపోతున్న కాలంతో' అని ఆ భయానక ఘటన ఎలాంటిదో మాటల్లో చెప్పేసారు.
1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసీ814ను హైజాక్ చేసిన టెర్రరిస్టులు.. లాహోర్, దుబాయిల మీదుగా అఫ్గానిస్థాన్లోని కాందహార్కు తరలించారు. వాళ్ల డిమాండ్స్ను ఒప్పుకున్న భారత ప్రభుత్వం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్తో పాటు మరో 36 మందిని విడుదల చేసింది. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితి ఏమిటి.. ప్రభుత్వం వారిని ఎలా కాపాడింది అనేది ఈ వెబ్ సిరీస్లో చూపించారు.నెట్ఫ్లిక్స్ లో ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సీరీస్ ను చూడటం మిస్ చేసుకోకండి.