కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీలకు రూ.400 : విజయ రమణారావు

కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీలకు రూ.400 : విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీల వేతనం రోజుకు రూ. 400కు పెంచుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలం ఐతరాజ్‌‌‌‌‌‌‌‌పల్లి, భూపతిపూర్, ఎలిగేడు మండలం సుల్తాన్‌‌‌‌‌‌‌‌పూర్, కట్టకిందపల్లె గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. గడ్డం వంశీ కృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు మినుపాల ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రావు, సాయిరి మహేందర్, డి.దామోదర్ రావు, చిలుక సతీశ్‌‌‌‌‌‌‌‌, వెంకటరమణారావు, వెంకన్న, తిరుపతి, వెంకటేశం పాల్గొన్నారు.