లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్. మొదటి ఆట నుంచే మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం 11 రోజుల్లోనే ఏకంగా రూ. 300 కోట్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కాగా తెలుగులో ఈ చిత్రాన్ని హీరో నితిన్ రిలీజ్ చేయగా ఇప్పటి వరకు రూ.14.40 కోట్ల షేర్ను సొంతం చేసుకుంది. అనిరుథ్ సంగీతం అందించిన ఈ సినిమాని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఆర్. మహేంద్రన్తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో నిర్మించారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించగా, హీరో సూర్య గెస్ట్ రోల్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ మూవీకి రూ. 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
#Vikram blue blooded blockbuster! Crosses worldwide ₹300 Cr in 11 days! pic.twitter.com/eLDCeClD1p
— Sreedhar Pillai (@sri50) June 14, 2022