రాములోరి కళ్యాణం.. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన గ్రామస్థులు

రాములోరి  కళ్యాణం.. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన గ్రామస్థులు

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ గ్రామం.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాముల వారి కళ్యాణాన్ని రమణీయంగా చేయాలని నిర్ణయించడమే కాక.. మిగిలిన గ్రామాలకు భిన్నంగా కులానికి ఒక కుటుంబాన్ని కళ్యాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించారు. తరాలు మారుతున్నాయి....నాయకత్వంలో సైతం మార్పులు రావడంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో ఒకరిద్దరి పెత్తనంతో ముందుకు సాగిన రాముల వారి కళ్యాణం.. నేడు అందరికీ అవకాశం కల్పిస్తూ ఆ ఊరి పెద్దాయన నడుం బిగించారు. ఒకరిద్దరి పెత్తనం వద్దని అన్ని కులాలను భాగస్వామ్యం చేసి నిజమైన రాముల వారి కళ్యాణం నిర్వహిస్తుండటంతో ఇప్పుడు ఆ ఊరంతా నామస్మరణతో మారుమ్రోగుతుంది.