ఫ్యాక్టరీ నిర్మిస్తే సూసైడ్​ చేసుకుంటాం .. తిమ్మయ్య పల్లి గ్రామస్తులు ఆందోళన

ఫ్యాక్టరీ నిర్మిస్తే సూసైడ్​ చేసుకుంటాం .. తిమ్మయ్య పల్లి గ్రామస్తులు ఆందోళన

బెజ్జంకి, వెలుగు: ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మిస్తే మూకుమ్మడిగా సూసైడ్​ చేసుకుంటామని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయపల్లి గ్రామస్తులు హెచ్చరించారు. శనివారం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరిగే చోట పురుగుల మందు డబ్బాలు,  పెట్రోల్ క్యాన్లు పట్టుకొని వచ్చి సూసైడ్​చేసుకుంటామని ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రీన్ బేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్​కంపెనీ జీరో పొల్యూషన్ ఉంటుందని చెప్పి జనాలను తప్పుదోవ పట్టించి ఫ్యాక్టరీ నిర్మిస్తుందని మండిపడ్డారు. దీనివల్ల గ్రామాల్లో దుర్వాసన వస్తుందని పంట పొలాలు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్​ఐ నరేందర్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి ప్రజలకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.