కోడ్ ఉల్లంఘించి.. కాలనీ వాసులతో మంత్రి  రహస్య సమావేశం ?

కోడ్ ఉల్లంఘించి.. కాలనీ వాసులతో మంత్రి  రహస్య సమావేశం ?

బీజేపీ నాయకుల ఆరోపణ

హైదరాబాద్:  గ్రేటర్ ఎన్నికల ప్రచార సమయం ముగిసింది.  ప్రచారమే కాదు.. ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదు.. అయితే విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం మన్సూరాబాద్ కాలనీ వాసులతో రహస్యంగా సమావేశమవుతున్న విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ అభ్యర్థి కొప్పుల నర్సింహ రెడ్డి, కొందరు  కార్యకర్తలతో కలసి మంత్రి ఉన్న ప్రాంతానికి తరలివెళ్లారు.  బీజేపీ కార్యకర్తలు వచ్చారని తెలియడంతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెనుదిరిగారు. ఈ వ్యవహారంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సమయం ముగిశాక కోడ్ ఉల్లంఘించి ఎలా ప్రచారం చేస్తారు ?  అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు.