న్యూఢిల్లీ: టీమిం డియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం 30వ పడిలోకి ప్రవేశించాడు. భార్య అనుష్క శర్మతో కలిసి హరిద్వార్ లో అతడు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్ష లు తెలిపా రు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తొలుత కోహ్లీకి విషెస్ తెలుపుతూ ట్వీ ట్ చేయగా.. తర్వాత సోషల్ మీడియాలో స్టా ర్ బ్యాట్స్మన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తా యి. ‘హ్యాపీ బర్త్ డే విరాట్ కోహ్లీ. ఈ ఏడాది నీ కు ఎన్నో విజయాలు, ఎంతో ఆనందం కలగాలని కోరుకుంటు న్నా’ని సచిన్ ట్వీ ట్ చేశాడు.భార్య అనుష్క శర్మ.. విరాట్ కు అద్భు తమైన
సందే శాన్నిచ్చిం ది. ‘థ ్యాంక్ గాడ్ ఫర్ హిస్ బర్త్’ అంటూ భర్తపై అనుష్క తన ప్రేమను చాటుకుం ది.హరిద్వార్ లో విరాట్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే, కోహ్లీకి మా జీ క్రికెటర్ వీరేం దర్ సెహ్వా గ్ తనదైన స ్టైల్లో విషెస్ చెప్పాడు. ‘ఈ ధన్ తేరాస్ రోజున.. ఈ ఏడాది కూడా రన్ తేరాస్తో నిం డిపోవాలని ఆకాం క్షిస్తు న్నాన’ని సెహ్వాగ్ ట్వీ ట్ చేశాడు. ‘మరిన్ని మ్యాచ్ –విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాలని కోరుకుంటూ టీమిం డియా కెప్టెన్ , రన్ మెషిన్ విరాట్ కోహ్లీకిహ్యా పీ బర్త్డే’ అని బీసీసీఐ పోస్ట్ చేసింది. ‘క్రికెట్ సా మ్రాట్..హ్యా పీ బర్త్ డే విరాట్ ’ అంటూ సురేశ్ రైనా శుభాకాంక్ష లు తెలిపా డు. స్పి న్నర్ హర్భజన్ సింగ్ ‘హ్యా పీ బర్త్ డే టు యూ బ్రదర్ . ఏడాది మరికొన్ని రికార్డులు బద్దలు కొడతావని, మరిన్ని సెం చరీలు చేస్-తావని ఆశిస్తు న్నా’అని ట్వీ ట్ చేశాడు. టీమిం డియా సభ్యులు మహ్మద్ షమీ, చటేశ్వర్ పుజారా, మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్ , వినోద్ కాంబ్లీ , అప్ఘానిస్థాన్ స్టా ర్ స్పి న్నర్ రషీద్ ఖాన్ తదితరులు కోహ్లీకి విషెస్ చెప్పారు. ఇటీవలే వన్డేల్లో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ అదే జోరు చూపిస్తూ మరిన్ని రికార్డులు ఖాతాలో వేసుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
