విరాటపర్వం కోసం ఏకంగా ముగ్గురు

విరాటపర్వం కోసం ఏకంగా ముగ్గురు

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. సినిమా ప్రమోషన్స్ లో  భాగంగా ఈ రోజు (జూన్ 15) న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ఏకంగా ముగ్గురు చీఫ్ గెస్టులు హజరు కానున్నారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్‌లతో పాటుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరు కాబోతున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో ఈ ఈవెంట్ పైన అందరికీ ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. రానా, సాయిపల్లవితో పాటుగా ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.