
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు (జూన్ 15) న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ఏకంగా ముగ్గురు చీఫ్ గెస్టులు హజరు కానున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్లతో పాటుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరు కాబోతున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో ఈ ఈవెంట్ పైన అందరికీ ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. రానా, సాయిపల్లవితో పాటుగా ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.
Grand star studded Pre Release Event of #VirataParvam live on June 15 from 6 PM onwards?
— SLV Cinemas (@SLVCinemasOffl) June 14, 2022
?Shilpakala Vedika, Hyd
▶️ https://t.co/oQfI8ZqiaZ@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @DivakarManiDOP @LahariMusic @SureshProdns pic.twitter.com/wXypNEzqda