విశాల్ 'లాఠీ' వాయిదా

విశాల్ 'లాఠీ' వాయిదా

హీరో విశాల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లాఠీ. వినోద్ కుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సునైనా హీరోయిన్‌గా నటిస్తోంది. రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు..  కానీ ఇప్పుడు  రిలీజ్ డేట్ ను మేకర్స్ వాయిదా వేశారు. చెన్నైలో లాఠీ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేస్తున్న టైమ్ లో విశాల్ కాలుకు గాయమైంది. దీంతో విశాల్ ను  చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

విశాల్  పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభించనునట్లు మేకర్స్ తెలిపారు. గాయపడిన విశాల్ కోలుకోవాడానికి మరో నెల సమయం పడుతుందిని వైద్యులు అంటున్నారు. ఈ క్రమంలో సినిమాను సెప్టెంబర్ 15 రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్టుగా మేకర్స్ తెలిపారు.  " విశాల్‌కు గాయాలు,  ఫైట్ సీక్వెన్స్‌లు, భారీ VFX వర్క్‌ల కారణంగా సినిమా విడుదలను ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 15కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము" అని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

అభిమన్యూడు మూవీ తరువాత విశాల్ కు సరైన హిట్ అయితే పడలేదు. చక్ర, ఎనిమీ సినిమాలు బోల్తా పడటంతో లాఠీ సినిమా పైనే అశాలు పెట్టుకున్నాడు.