తమిళ స్టార్ హీరో విశాల్(Vishal), దర్శకుడు ఎస్జే సూర్య(SJ Surya) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ(Mark Antony). అదిక్ రవిచంద్రన్(Adhik ravichandran) దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఆ అంచనాలను అందుకోవడంలో విజయం సాధించింది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తమిళంలో ఈ సినిమా ఏకంగా రూ.100కోట్ల వసూళ్లను రాబట్టింది.
Also Read : లేడీ సింగం వచ్చేసింది.. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో దీపిక
ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలో కూడా రిలీజయింది. అక్కడ కూడా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది ఈ సినిమా. అక్టోబరు 13న అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం ఇండియాలోనే టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. దీంతో మార్క్ ఆంటోనీ టీమ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు హీరో విశాల్.
Happy to see #MarkAntony killing it in Ott platform too. Trending no 1 in Amazon Prime.
— Vishal (@VishalKOfficial) October 14, 2023
Enjoy the unlimited entertainment, especially my favourite Silk Smitha scene in your own homes now. God Bless pic.twitter.com/RXTCaQJNQY
మార్క్ ఆంటోనీ మూవీకి ఓటీటీలో మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ట్రేండింగ్ వన్ లో ఉంది. మార్క్ ఆంటోనీ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. మరీ ముఖ్యంగా నా ఫేవరెట్ సిల్క్ స్మితను మీ ఇంట్లో నుంచే చూసి ఎంజాయ్ చేయండి.. అంటూ రాసుకొచ్చాడు విశాల్.