నిజామాబాద్ లో సెంట్రల్​ ఎలక్షన్​ కమిషన్ ​ప్రతినిధుల పర్యటన

నిజామాబాద్ లో సెంట్రల్​ ఎలక్షన్​ కమిషన్ ​ప్రతినిధుల పర్యటన

నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఢిల్లీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిషన్​ఆఫీసర్లు ప్రమోద్​ కుమార్​శర్మ, రితేశ్​సింగ్​జిల్లా కేంద్రానికి వచ్చారు. నగరంలోని కొన్ని పోలింగ్​ కేంద్రాలను విజిట్​ చేశారు. రెండో విడతలో జరుగుతున్న ఓటరు లిస్టు సవరణను పరిశీలించారు.

కొత్త ఓటర్ల నమోదు, మార్పు, చేర్పుల లిస్టును పరిశీలించి ఆరు కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. కలెక్టర్ ​రాజీవ్​గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్ ఢిల్లీ అధికారుల వెంట ఉన్నారు.