సికింద్రాబాద్, వెలుగు: ఈ నెల 10 నుంచి తిరిగి ప్రారంభించిన శతాబ్ది ఎక్స్ప్రెస్కు కొత్తగా విస్టాడోమ్ కోచ్ లను అందుబాటులోకి తెచ్చారు. సికింద్రాబాద్–పుణె మధ్య నడిచే ఈ రైలుకు ఇప్పటి వరకు ఉన్న కోచ్లతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన విస్టా డోమ్ కోచ్లతో ప్యాసింజర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రొటేట్ చేసుకునేలా సీట్లు, పెద్ద పెద్ద గాజు కిటికీలే కాకుండా రైలు పైకప్పుకు కూడా గాజు విండోస్ ఉండటమే ఈ రైలు స్పెషాలిటీ.
రోజూ మధ్యాహ్నం 2.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరే ఈ రైలు అదేరోజు రాత్రి 11 గంటలకు పుణెకు చేరుకుంటుంది. పుణె నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్కు మధ్యాహ్నం 2.20కు చేరుకుంటుంది. విస్టాడోమ్ కోచ్లో ఒకరికి రూ. 2,110, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో రూ.1,935 చార్జి ఉంటుంది.