రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి

రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం  ఇవ్వాలి

తుమ్మిడి హెట్టి నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను రానీయకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ కట్టాడన్నారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం రీ డిజైనింగ్ తప్పు అని చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నీట మునిగిన పంటలను బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు వివేక్. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మూడేళ్లుగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంట నష్టం జరుగుతున్నా ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఎకరానికి 50 వేల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.