ధైర్యంగా ఓటు వేయండి : జీడిమెట్ల సీఐ పవన్

ధైర్యంగా ఓటు వేయండి : జీడిమెట్ల సీఐ పవన్

జీడిమెట్ల, వెలుగు: ఓటర్లు స్వేచ్ఛాయుతంగా, ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జీడిమెట్ల సీఐ పవన్ కోరారు. శాంతియుత వాతావరణంలో ఓటు వేసేందుకు ప్రజలకు భరోసా కల్పించేందుకు జీడిమెట్ల పీఎస్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం అదనపు బలగాలతో కవాతు నిర్వహించారు.

శ్రీనివాస నగర్, షాపూర్ నగర్, సంజయ్ గాంధీ నగర్, వివేకానంద నగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగించారు.  ఈ మార్చ్ లో సెంట్రల్ ఫోర్సు కు చెందిన 50 మంది అదనపు బలగాలు, 20 మంది జీడిమెట్ల పోలీసులు పాల్గొన్నారు.