మహేశ్వరం ఓటర్లు బీజేపీ వైపే.. ఆ పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు ధీమా

మహేశ్వరం ఓటర్లు బీజేపీ వైపే.. ఆ పార్టీ అభ్యర్థి  అందెల శ్రీరాములు ధీమా

బడంగ్​పేట, వెలుగు:  మహేశ్వరం సెగ్మెంట్ వాసులు బీజేపీ వైపే ఉన్నారని ఆ పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సరూర్​నగర్ డివిజన్ లక్ష్మీ నగర్, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ కాలనీ, విజయపురి కాలనీల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో డివిజన్ అధ్యక్షుడు సిద్ధూ ముదిరాజ్‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి జిల్లా నాయకులు ఆరుట్ల సురేశ్‌‌‌‌‌‌‌‌, బాణాల ప్రవీణ్ సహా డివిజన్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కందుకూరు మండలం జైత్వారం, తిమ్మాపురం, దెబ్బడగూడ గ్రామాల నుంచి మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, కన్వీనర్ ఏల్మేటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువకులు బీజేపీలో చేరగా.. అందెల శ్రీరాములు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ సభ్యులు అందెల శ్రీరాములును కలిసి మద్దతు తెలిపారు. బీసీని సీఎం చేస్తామన్న బీజేపీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర అడ్వకేట్స్ జేఏసీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం సెగ్మెంట్  ప్రజాప్రతినిధులు, బీజేపీ, బీజేవైఎం, మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.