అందరూ అదరగొట్టారు..ఆస్ట్రేలియాను ఓడగొట్టారు:వీవీఎస్ లక్ష్మణ్

అందరూ అదరగొట్టారు..ఆస్ట్రేలియాను ఓడగొట్టారు:వీవీఎస్ లక్ష్మణ్

నాగ్ పూర్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం భారత్ సన్నద్ధమైన తీరు అమోఘమన్నాడు. ఫస్ట్ టెస్టులో భారత జట్టు స్పష్టమైన ఆధిపత్యం చలాయించిందన్నాడు. 

బ్యాటింగ్లో కీలక సమయంలో సూపర్ హాఫ్ సెంచరీలు చేసిన రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిద్దరు ఆల్ రౌండ్ పర్ఫామెన్స్తో అదరగొట్టారని మెచ్చకున్నాడు. ఇతర బౌలర్లు గుర్తిండిపోయే ప్రదర్శన చేశారని చెప్పాడు. ఇక ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుత సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడని కొనియాడాడు.  బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇది మంచి ఆరంభం అని వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.