పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్మోండా మార్కెట్ గ్రెయిన్విభాగంలో ఉన్న హమాలీలతో రోజూ 12 గంటలు పనిచేయించుకుంటూ, శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ అన్నారు. కూలీ రేట్లు పెంచాలని డిమాండ్చేశారు. ఆదివారం మోండా మార్కెట్లో హమాలీ యూనియన్సమావేశం జరిగింది. పలువురు హమాలీలు ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. హమాలీలకు ఏటా రెండు జతల యూనిఫాం, మార్కెట్ కమిటీ నుంచి లైసెన్స్లు ఇవ్వాలని డిమాండ్చేశారు. కూరగాయల విభాగంలో పెంచినట్లుగానే గ్రెయిన్మార్కెట్ హమాలీలకు కూడా చార్జీలు పెంచాలని చోరారు. ప్రభుత్వం హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. హమాలీ యూనియన్నాయకులు బెల్లపు నరేశ్, మోతె రవి, హత్కురి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
