హైదరాబాద్సిటీ, వెలుగు: వాఘ్బక్రీ టీ గ్రూప్కు చెందిన సేవా విభాగం వాఘ్బక్రీ ఫౌండేషన్, అక్షయ పాత్ర ఫౌండేషన్తో కలిపి 8 ప్రత్యేక ఆహార పంపిణీ వాహనాలను సోమవారం ప్రారంభించింది. బడి పిల్లలకు పోషకాహారం అందించేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. నగరంలోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఆలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటి వరకూ అక్షయ పాత్రకు వాఘ్ బక్రీ ఫౌండేషన్ 5 కోట్ల విలువైన 38 వాహనాలు అందజేసింది. అక్షయపాత్ర తెలంగాణ, ఏపీ అధ్యక్షుడు సత్యగౌరచంద్ర దాస ప్రభూజీ, వాఘ్బక్రీ టీ గ్రూప్ ఈడీ పరాస్ దేశాయ్, వాఘ్బక్రీ బ్రాండ్అంబాసిడర్ సుమ కనకాల పాల్గొన్నారు.
