మూగజీవాలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించకూడదంటూ ఓ వైపు జంతుప్రేమికులు చెబుతున్నా…కొందరు వారి ఆనందం కోసం వాటికి కష్టం కలిగిస్తునే ఉంటారు. ఓ పర్యాటకుడు నిద్రపోతున్న పులిని లేపాడు. దీనికి పర్యావసానంగా ఫైన్ కట్టాడు.ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.
జైపూర్ సమీపంలోని రాంతాంబోర్ టైగర్ రిజర్వ్కు గైడర్తో పాటు ఓ టూరిస్టు వచ్చాడు. పార్క్లోని జోన్-6లో ఉన్న పిలిఘాట్ గేట్ నుంచి వీరు ఒక జెప్సీలో పార్క్లోకి ప్రవేశించారు. పార్క్ గురించి గైడర్ చెప్పే విషయాలు వింటూ తన కెమెరాలో పార్క్లోని ప్రదేశాలను జంతువులను ఫొటోలు తీస్తున్నాడు ఆ పర్యాటకుడు.
ఇంతలో వాళ్లకు నిద్రపోతున్న పులి కనిపించింది. అయితే ఆ పులిని నిద్రలేపాలని అనుకున్నారు. వెంటనే కొన్ని రాళ్లు తీసుకొని పులి మీద విసిరారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పులుల సంరక్షణాధికారి టూరిస్టుకు, గైడర్కు కలిపి 51,000 రూపాయల జరిమానా విధించారు.