ఆగస్టు 9న ‘ప్రజాస్వామ్య తెలంగాణ’ కోసం పాదయాత్ర

ఆగస్టు 9న ‘ప్రజాస్వామ్య తెలంగాణ’ కోసం పాదయాత్ర
  • హైదరాబాద్ భాగ్యలక్షీ దేవాలయం నుంచి హుజూరాబాద్ వరకు పాదయాత్ర
  • క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో  ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాదయాత్ర

హుజూరాబాద్: వచ్చే ఆగస్ట్ 9వ తేదీన ‘‘ప్రజాస్వామ్య తెలంగాణ’’ కోసం పాదయాత్ర చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి హుజురాబాద్ వరకు మహా పాదయాత్ర చేపడతానని చెప్పారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన రోజు ఆగస్టు 9 అని గుర్తు చేస్తూ.. మన తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో  పాదయాత్రను ప్రారంభిస్తున్నానని చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి హుజూరాబాద్ వరకు కొనసాగిస్తానని ఆయన వివరించారు.