
పెబ్బేరు/శ్రీరంగాపూర్, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం పెబ్బేరు మండలం రంగాపూర్, శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భాగంగా అధికారులు మీ గ్రామానికి వస్తారని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి గ్రామంలోని రైతుల సమస్యలపై అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.
అనంతరం పెబ్బేరు మండలం పాతపల్లి ఐకేపీ సెంటర్ను సందర్శించారు. శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామంలోని రేషన్షాపును తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో మంజూరయిన ఇందిరమ్మ ఇండ్లను సందర్శించారు. లబ్ధిదారు కట్టుకున్న ఇందిరమ్మ ఇంటిని సందర్శించారు. కార్యక్రమంలో డీఎస్వో విశ్వనాథ్, ఆర్డీవో సుబ్రమణ్యం, శ్రీరంగాపూర్, పెబ్బేరు తహసీల్దార్లు రాజు, పి.మురళి, ఆర్ఐ పాల్గొన్నారు.