భూభారతి  రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి  : కలెక్టర్ ఆదర్శ్ సురభి

భూభారతి  రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి  : కలెక్టర్ ఆదర్శ్ సురభి

పెబ్బేరు/శ్రీరంగాపూర్​, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి అన్నారు. గురువారం పెబ్బేరు మండలం రంగాపూర్, శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భాగంగా  అధికారులు మీ గ్రామానికి వస్తారని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి గ్రామంలోని రైతుల సమస్యలపై అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.

 అనంతరం పెబ్బేరు మండలం పాతపల్లి ఐకేపీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామంలోని రేషన్​షాపును తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో మంజూరయిన ఇందిరమ్మ ఇండ్లను సందర్శించారు. లబ్ధిదారు కట్టుకున్న ఇందిరమ్మ ఇంటిని సందర్శించారు. కార్యక్రమంలో డీఎస్‌‌‌‌‌‌‌‌వో విశ్వనాథ్, ఆర్డీవో సుబ్రమణ్యం, శ్రీరంగాపూర్, పెబ్బేరు తహసీల్దార్లు రాజు, పి.మురళి, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ పాల్గొన్నారు.