సాధువుల వేషం..బంగారం రెట్టింపు చేస్తామంటూ మోసం

సాధువుల వేషం..బంగారం రెట్టింపు చేస్తామంటూ మోసం
  • ఇద్దరు ఆంధ్ర ముఠా సభ్యుల అరెస్టు

నాగర్ కర్నూలు జిల్లా: చూడగానే అందరూ గౌరవించేలా సాధువుల వేష ధారణలో తిరుగుతూ.. పూజలు చేసి బంగారం రెట్టింపు చేస్తామని అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న ఇదరు ఆంధ్ర రాష్ట్ర ముఠా సభ్యులను నాగర్ కర్నూల్ జిల్లా  కల్వకుర్తి పోలీసులు అరెస్టు చేశారు. వీరు పట్టణంలో సాధువు వేష ధారణలతో తిరుగుతూ అమాయకులకు వల విసురుతున్నారు. తమ వలకు చిక్కిన అమాయకులకు తాము పూజలు చేసి బంగారం రెట్టింపు చేస్తామని నమ్మించి మోసం చేసి పరార్ అవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు  పూజలు చేసి బంగారం కాజేసిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులిద్దరిని గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 25 వేల రూపాయల నగదు, రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కల్వకుర్తి పోలీసులు రిమాండ్ కు తరలించారు.