
- గణేశ్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి
పద్మారావునగర్, వెలుగు: వినాయక చవితి నవరాత్రోత్సవాల నేపథ్యంలో ఆదివారం వారాసిగూడ పోలీస్స్టేషన్లో ఏసీపీ జైపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ పి.శంకర్ గణేశ్ మండపాల నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గణేశ్ పండుగ, నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేకు అనుమతి లేదన్నారు. వర్షాల కారణంగా మండపాల వద్ద కరెంట్తీగలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలన్నారు.
రోడ్లను పూర్తిగా మూసివేయకుండా, బైక్ల రాకపోకలకు దారిని వదలాలని తెలిపారు. జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, ఎలక్ర్టిసిటీ, ఎండోమెంట్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐలు సుధాకర్, సునీత, ప్రకాశ్రెడ్డి, ఎండీ అబ్దుల్అజీజ్ పాల్గొన్నారు.