డీజేలకు పర్మిషన్ లేదు : ఏసీపీ జైపాల్ రెడ్డి

డీజేలకు పర్మిషన్ లేదు : ఏసీపీ జైపాల్ రెడ్డి
  • గణేశ్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి 
     

పద్మారావునగర్​, వెలుగు:  వినాయక చవితి నవరాత్రోత్సవాల నేపథ్యంలో ఆదివారం వారాసిగూడ పోలీస్​స్టేషన్​లో ఏసీపీ జైపాల్ రెడ్డి, ఇన్​స్పెక్టర్​ పి.శంకర్ గణేశ్​ మండపాల నిర్వాహకులకు కౌన్సిలింగ్​ ఇచ్చారు. గణేశ్​ పండుగ, నవరాత్రులను  శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేకు అనుమతి లేదన్నారు. వర్షాల కారణంగా మండపాల వద్ద కరెంట్​తీగలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలన్నారు.

రోడ్లను పూర్తిగా మూసివేయకుండా, బైక్​ల రాకపోకలకు దారిని వదలాలని తెలిపారు. జీహెచ్ఎంసీ, ఆర్​అండ్​బీ, ఎలక్ర్టిసిటీ, ఎండోమెంట్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐలు సుధాకర్, సునీత, ప్రకాశ్​రెడ్డి, ఎండీ అబ్దుల్​అజీజ్ పాల్గొన్నారు.