- ఢిల్లీలో పట్టుకున్న పోలీసులు
న్యూఢిల్లీ : హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన టెర్రరిస్టు జావెద్ అహ్మద్ మట్టూను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడి దగ్గరి నుంచి పిస్తోల్, మ్యాగజైన్, వెహికల్ స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకాశ్మీర్లోని సోపోర్కు చెందిన జావెద్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. అతనిపై రూ.10 లక్షల రివార్డు ఉంది.
జమ్మూకాశ్మీర్లో జరిగిన పలు టెర్రర్ దాడుల్లో జావెద్ ప్రమేయం ఉంది. జావెద్ కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కొన్ని రోజులుగా వెతుకుతున్నది. ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో జావెద్ మట్టూను అరెస్టు చేశాం. వివిధ ఘటనల్లో ఐదుగురు పోలీసులను చంపాడు” అని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ హెచ్ జీఎస్ ధాలివాల్ తెలిపారు.