రాయికల్, వెలుగు: రాయికల్ మండలం మంక్త్యానాయక్ తండా జీపీ ఎన్నికల్లో విచిత్రం జరిగింది. టాస్తో గెలిచిన వార్డు సభ్యుడు.. సర్పంచ్ ఓటుతో ఉపసర్పంచ్ అయ్యాడు. మంక్త్యానాయక్ తండాలో 8 వార్డులున్నాయి. ఇందులో 7వ వార్డు నుంచి నునావత్ రాజు, మాలోతు సూర్యనాయక్పోటీ పడ్డారు.
ఆ వార్డులో 59 ఓట్లు పోల్ కాగా, ఒకటి చెల్లలేదు. ఇద్దరికి చెరో 29 చొప్పున వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా ఫలితం లేకపోవడంతో ఎన్నికల అధికారి టాస్ వేశారు. ఈ టాస్లో సూర్యనాయక్ గెలుపొందారు. దీంతో 8 వార్డుల్లో ఇరువర్గాలు చెరో నాలుగు గెలిచారు. దీంతో ఉపసర్పంచ్ పదవికి పోటీ ఏర్పడింది. సర్పంచ్ మాలోతు తిరుపతి ఓటుతో సూర్యనాయక్ ఉపసర్పంచ్గా ఎన్నికయ్యాడు.
