- సార్ వస్తున్నరని ట్రాఫిక్ ఆపిన ఆఫీసర్
- అస్సాం సీఎం ఆగ్రహం
- తన కాన్వాయ్ కోసం జనాన్ని ఆపొద్దంటూ ఆదేశాలు
గువాహటి: ముఖ్యమంత్రి వస్తున్న రూట్లో ఆయన వెళ్లే వరకు ట్రాఫిక్ ఆపేస్తరు. ఆయన వెళ్లిన తరువాతే అందరినీ పంపిస్తరు. కానీ అదే పని చేసిన ఓ ఆఫీసర్పై సీఎం ఫైర్ అయ్యారు. ఈ సంఘటన అస్సాంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాగావ్ జిల్లాలోని గుమోతా గావ్ దగ్గర నేషనల్ హైవేపై సీఎం కాన్వాయ్ వస్తున్నందున సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ట్రాఫిక్ నిలిపేయాలని అధికారులను డిప్యూటీ కమిషనర్ (డీసీ) నిసర్గ్ హవారె ఆదేశించారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనిని గమనించిన సీఎం.. ట్రాఫిక్ జామ్కు కారణం తెలుసుకోవడానికి కారును ఆపారు. కారణం తెలుసుకుని సదరు ఆఫీసర్పై మండిపడ్డారు. రాష్ట్రంలో వీఐపీ కల్చర్ను అనుమతించబోమని మరోసారి స్పష్టం చేశారు. ‘‘ఏమిటీ డ్రామా? డీసీ సాబ్. ఈ వెహికల్స్ ఎందుకు ఆగాయి? రాజు గారు కానీ వస్తున్నారా ఏంటి? మరోసారి ఇలా జరగకూడదు. ఇలా ఆపడం కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వెహికల్స్ను వెంటనే పంపించండి’’ అని సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పడం వీడియోలో కనిపించింది.
#WATCH Assam CM Himanta Biswa Sarma reprimands DC Nagaon for traffic jam near Gumothagaon on National Highway 37.
— ANI (@ANI) January 15, 2022
He was in the area to lay the foundation stone of a road, earlier today. pic.twitter.com/nXBEXxpu6k