మోటర్ లేకుండానే బోరు నుంచి ఉబికివస్తున్న నీరు

మోటర్ లేకుండానే బోరు నుంచి ఉబికివస్తున్న నీరు

ములుగు జిల్లా: గోగుపల్లిలో రైతు తన పొలంలో వేయించిన వ్యవసాయ బోరు నుంచి నీరు పైకి ఉబికివస్తుంది. వ్యవసాయం చేయడానికి నీటి వసతి లేక వర్షాలపైనే ఆధారపడాల్సి వచ్చేదన్నాడు రైతు. అయితే నీటి కోసం బోరు వేయగా 300 అడుగుల్లో వాటర్ పడిందన్నాడు. అయితే మెటారును పెట్టకుండానే నిరంతరం నీరు పైకి వస్తుందని తెలిపాడు. దీంతో కరెంటు, మెటారు బాధలు తప్పాయని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తనకున్న 15 ఎకరాలకు మాత్రమే కాకుండా.. పక్కన వాళ్ల 5 ఎకరాలకు కూడా నీరు అందిస్తున్నానని చెప్పాడు రైతు.