వాటర్​బోర్డు ఎండీగా సుదర్శన్​రెడ్డి బాధ్యతలు

వాటర్​బోర్డు ఎండీగా  సుదర్శన్​రెడ్డి బాధ్యతలు

హైదరాబాద్,వెలుగు :  మెట్రోవాటర్​బోర్డు ఎండీగా సి.సుదర్శన్ రెడ్డి  ఖైరతాబాద్ లోని హెడ్డాఫీసులో సోమవారం ఉదయం10 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు బదిలీపై వెళ్తున్న దానకిశోర్ బాధ్యతలు అప్పగించారు. 2002 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ కు చెందిన సుదర్శన్​రెడ్డి ఉమ్మడి ఏపీలో విశాఖపట్నం జిల్లా పాడేరు సబ్ కలెక్టర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్

తూర్పు గోదావరి, రంగారెడ్డి జిల్లాల జేసీగా, కర్నూలు కలెక్టర్ గా కొనసాగారు. అనంతరం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా పనిచేశారు.  తిరిగి రాష్ట్రానికి వచ్చి.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.