సంక్రాంతి కానుకగా ‘ఆదిపురుష్’

సంక్రాంతి కానుకగా ‘ఆదిపురుష్’

ప్రభాస్ నుంచి రాబోతున్నమోస్ట్ అవైటింగ్ మూవీ ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు  ఓం రౌత్‌‌ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రమోషన్స్ ప్రారంభించారు. నిన్న అయోధ్యలో జరిగిన ఈవెంట్‌‌లో ఐదు భాషల్లో టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. ‘భూమి కుంగినా, నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వ నాశనం. వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి. ఆగమనం.. అధర్మ విధ్వంసం’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. రాముడిగా ప్రభాస్‌‌, సీతగా కృతి, రావణుడిగా సైఫ్‌‌ అలీఖాన్‌‌ లుక్స్‌‌ ఆకట్టుకున్నాయి. విజువల్స్ హాలీవుడ్‌‌ స్థాయిలో ఉన్నాయి. ఈ టీజర్‌‌‌‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక టీజర్ రిలీజ్‌‌లో ప్రభాస్ మాట్లాడుతూ ‘శ్రీరాముడి ఆశీస్సు_ల కోసం అయోధ్యకు వచ్చాం. మొదట ఈపాత్రలో నటించేందుకు భయపడ్డా. మూడు రోజుల తర్వాత ఓం రౌత్‌‌కి ఫోన్ చేసి, ఈ పాత్రలో మెప్పించడం ఎలా అనేది మాట్లాడాక ఓకే చెప్పా. ప్రేమ, భయ భక్తులతో ఈ చిత్రాన్ని రూపొందించాం. అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం లాంటి గుణాలు శ్రీరాముడి ప్రవర్తన నుంచి మనం నేర్చుకోవచ్చు.

శతాబ్దాలుగా మనం ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నాం కానీ మన వల్ల కావడం లేదు. అందుకే మనం మనుషులం అయ్యాం, శ్రీరాముడు దేవుడు అయ్యారు. ఆ శ్రీరాముడి కృప మాపై ఉంటుందని నమ్ముతున్నాం’ అన్నాడు. కృతి సనన్ మాట్లాడుతూ ‘నవరాత్రుల సమయంలో అయోధ్యలో టీజర్‌‌‌‌ రిలీజ్‌‌ చేయడం శుభపరిణామంగా భావిస్తున్నా. ఇలాంటి గొప్ప కథల్లో, పాత్రల్లో నటించే అవకాశం రావడం అరుదు. నాకు ఆ చాన్స్ చాలా త్వరగా దక్కింది. నా కెరీర్‌‌‌‌లో ఇది మెమొరబుల్ రోల్. మన ఇతిహాస ఘనతను ఇందులో చూస్తారు’ అంది. ‘ఇది సినిమా మాత్రమే కాదు... భక్తికి ప్రతీక. ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరుతున్నాం. దసరా రోజున ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగే రావణ దహనంలో పాల్గొనబోతున్నాం’ అన్నాడు ఓం రౌత్. నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ ‘మా నాన్నగారు గుల్షన్ కుమార్ శ్రీరామ భక్తుడు. రామాయణం ఆధారంగా సినిమా చేయాలనే ఆయన డ్రీమ్‌‌ ఈ చిత్రంతో నెరవేరుతుండటం సంతోషం. ప్రభాస్, కృతి అద్భుతంగా నటించారు’ అని చెప్పారు.