మరో 1050 కొత్త బస్సులు తెస్తున్నాం : ఖుస్రోషా ఖాన్​

మరో 1050 కొత్త బస్సులు తెస్తున్నాం : ఖుస్రోషా ఖాన్​

సికింద్రాబాద్, వెలుగు: మెరుగైన సేవలు అందించేందుకు మే లోపు మరో 1,050 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్​ ఖుస్రోషా ఖాన్​ చెప్పారు. సోమవారం సికింద్రాబాద్​రేతిఫైల్​బస్​స్టేషన్​వద్ద దసరా లక్కీ డ్రా నిర్వహించారు. ఐదుగురు మహిళలు, ఐదుగురు మగవారిని విజేతలుగా ఎంపిక చేశారు. ఒక్కో విజేతకు రూ.9,900 అందజేయనున్నట్లు తెలిపారు.