బాధిత కుటుంబాలను ఆదుకుంటాం..మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం..మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
  • బాధిత కుటుంబాలకు పరామర్శ

బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న పలువురు పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల బీజేపి అధ్యక్షుడు మంచాల పరుశరాం కుటుంబాన్ని  వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అలాగే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంట్రాక్టర్ బస్తీలో అనారోగ్యంతో బాధపడుతున్న బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకంటానని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. వివేక్ వెంట దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాడే సూర్య నారాయణ, జిల్లా నాయకుడు గాజుల మల్లేశం, పార్టీ కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

నూతన జంటకు ఆశీర్వాదం...

మంచిర్యాల జిల్లా జిల్లాలోని  బెల్లంపల్లి పట్టణం నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీలో బీజేపి మహిళా నేత కయిత భాగ్యలక్ష్మి  కూతురు  సుప్రియ వివాహానికి బీజేపి కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సుప్రియ - సందీప్లను వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. 

ఇవి కూడా చదవండి

లతా మంగేష్కర్‌‌ మృతిపై పాక్‌ ప్రధాని సంతాపం

ఐదెకరాలలోపు ఉంటెనే రైతుబంధు ఇయ్యాలె