భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి. శాశ్వత సమస్యలైన మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, క్యాతనపల్లి చైర్ పర్సన్ జంగం కళతో కలిసి కాలభైరవుడిని దర్శించుకున్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధారి ఖిల్లాను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. టూరిజం స్పాట్ గా  గాంధారి ఖిల్లాను   అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి.