త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తే ఖబర్దార్

త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తే ఖబర్దార్

హైద‌రాబాద్‌:జ‌ర‌గ‌బోయే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధిక స్థానాలు గెలిచి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామ‌ని అన్నారు ‌బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ. బీజేపీ కి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంద‌ని ఆమె అన్నారు. న‌గ‌రంలోని సైదాబాద్ డివిజన్ లో నిర్వ‌హించిన రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని, సైదాబాద్ లో ఒక్క సమస్యకు పరిష్కారం చేయలేదని అన్నారు. డ్రైనేజీ,డ్రీంకింగ్ సమస్యలు, గుంతల రోడ్లు అలాగే ఉన్నాయ‌ని అన్నారు. రూ. 2 కోట్ల తో స్మశానవాటికలను అభివృద్ధి చేస్తామ‌ని, ఇంతవరకు చేయలేద‌న్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలదృష్టి కి తీసుకొని వెళతామ‌ని అన్నారు డీకే అరుణ‌. టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు., బీజేపీ పై దుష్ప్రచారం చేస్తున్నారని, బీజేపీని కట్టడికి చేయలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నార‌న్నారు. తాను కాంగ్రెస్ నేత‌ల‌తో ,చర్చలు జరిపినట్లు సోషల్ మీడియాలోఅబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చ‌రించారు