యాడ్ రంగంలోకి బాలయ్య.. శ్రేయాస్ మీడియా కృతజ్ఞతలు

యాడ్ రంగంలోకి బాలయ్య.. శ్రేయాస్ మీడియా కృతజ్ఞతలు

నందమూరి నటసింహం ‘బాలకృష్ణ’ యాడ్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తన కెరీర్ లోనే తొలిసారి ఓ కమర్షియల్ యాడ్ లో కనిపించబోతున్నారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయిప్రియ కన్ స్ట్రక్షన్ గ్రూప్ ఓ యాడ్ ను తెరకెక్కిస్తోంది. యాడ్ రంగంలోకి అడుగుపెడుతున్న బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు శ్రేయాస్ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. యాడ్‌కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసింది. అందులో ఓ లగ్జరీ కారు కనిపిస్తోంది. ఇప్పటికే తన నటన, టాక్ షోలతో అదరగొడుతున్న బాలయ్య అడ్వర్ టైజ్ మెంట్స్ లో ఎలా కనిపిస్తారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘అన్ స్టాపబుల్’ టాక్ షో మొదటి సీజన్ పూర్తి చేసుకొని రెండో సీజన్ లోకి అడుగుపెట్టింది.

‘అఖండ’ సినిమా ఘన విజయం సాధించిన అనంతరం డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేష్ లో బాలయ్య ఓ సినిమా చేస్తున్నారు. NBK 107 పేరిట ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద చిత్ర టైటిల్ ను ప్రకటించారు. ‘వీరసింహారెడ్డి ’ గాడ్ ఆఫ్ మాసెస్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా మూవీ రిలీజ్ కానుంది.  ఈ మూవీలో బాలయ్య సరసన ‘శృతిహాసన్’ హీరోయిన్ గా నటిస్తున్నారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీకి బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.