వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం బుద్ధా దేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన లింగ మార్పిడి ఆపరేషన్చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించి డాక్టర్లు, లాయర్లు, నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఇటీవలే ఆమె ఎల్జీబీటీక్యూ ఉద్యమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమాజం నుంచి ఎదురైన విమర్శలపై ఆమె స్పందిస్తూ 'నా వయస్సు 41 సంవత్సరాలు. నాకు సంబంధించిన అన్ని నిర్ణయాలను నేనే తీసుకోగలను. ఇది నా సొంత నిర్ణయం, పోరాటం. నా మాటలు వక్రీకరించొద్దు. నేను ఒంటరిగా పోరాడాలనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి ఈ ధోరణి ఉంది. చాలా మంది నా నిర్ణయాన్ని సమర్థించారు. చాలా మంది వ్యతిరేకించారు. మానసికంగా నేను అబ్బాయినే.. అందుకే శారీరకంగా కూడా మారాలనుకుంటున్నాను. ఎవరి ప్రశ్నకైనా జవాబు ఇచ్చేందుకు నేను రెడీగా ఉన్నా. దయచేసి ఈ విషయంలోకి నా తల్లిదండ్రులను లాగొద్దు' అని విన్నవించారు.
కాగా ఆమె తండ్రి బుద్ధదేవ్ భట్టాచార్య (సీపీఐ) 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్కు 7వ సీఎం గా పని చేశారు. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయనకు ఉంది.