బెంగళూరు : సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్ బ్యాటింగ్లో తడబడింది. సౌత్ పేసర్ విద్వత్ కావేరప్ప (4/44) చెలరేగడంతో.. గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 45 ఓవర్లలో 129/7 స్కోరు చేసింది. ఆట ముగిసే సమయానికి అతిత్ సేథ్ (5 బ్యాటింగ్), ధర్మేంద్రసిన్హ్ జడేజా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పృథ్వీ షా (67), హర్విక్ దేశాయ్ (21) మినహా మిగతా వారు నిరాశపర్చారు. స్టార్టింగ్ నుంచే సౌత్ పేసర్లు రెండు వైపుల నుంచి ఎదురుదాడి మొదలుపెట్టడంతో వెస్ట్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (11), చతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ (8), సర్ఫరాజ్ ఖాన్ (0), శామ్స్ ములానీ (0) ఫెయిలయ్యారు. విజయ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం వెస్ట్ 84 రన్స్ వెనకబడి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 182/7తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 78.4 ఓవర్లలో 213 రన్స్కు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్లు సుందర్ (22 నాటౌట్), విజయ్ కుమార్ (13) త్వరగానే ఔటయ్యారు.