
ఇటీవల విడుదలైన 'కాంతార' సినిమా డివైన్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించిన హీరో రిషబ్ శెట్టి, రీసెంట్ గా స్టూపర్ స్టార్ రజనీ కాంత్ ను కలిశారు. వీరి మీటింగ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా రిషబ్ శెట్టి షేర్ చేశారు. దాంతో పాటు ఒక్కసారి పొగిడితే.. వందసార్లు మెచ్చుకున్నట్టే అని రాసుకొచ్చారు. అంటే రజనీ కాంత్ దగ్గర ఒక్కసారి ఆశీర్వాదం తీసుకుంటే వంద సార్లు తీసుకున్నట్టు అని ఆయన ఇన్ డైరెక్టుగా చెప్పారు. 'కాంతార' సినిమాకు ఆయనకు నచ్చినందుకు రిషబ్ శెట్టి కృతజ్ఞతలు తెలియజేశారు.
గత కొన్ని రోజుల క్రితం 'కాంతార' సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ రజనీ కాంత్.. ఈ మూవీ బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత రీసెంట్ గా ఆ చిత్ర హీరో రిషబ్ శెట్టి నేరుగా ఇంటికి పిలిపించుకొని సన్మానించారు. ఈ క్రమంలోనే రిషబ్ శెట్టి, రజనీ కాంత్ పాదాలను తాకుతూ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయనతో రజనీ కాసేపు సరదాగా ముచ్చటించారు.