జీడిమెట్లలో పటాకులు కొనేందుకు వెళ్తూ యువకుడు మృతి

జీడిమెట్లలో పటాకులు కొనేందుకు వెళ్తూ యువకుడు మృతి

జీడిమెట్ల, వెలుగు : దీపావళి పండుగకు పటాకులు కొనడానికి వెళ్తూ ఓ యువకుడు యాక్సిడెంట్ కు గురై చనిపోయిన ఘటన పేట్​బషీరాబాద్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... మెదక్​కు చెందిన పి.మహేశ్​(30)ఆదివారం దీపావళి పండుగకు పటాకులు కొనేందుకు తన పల్సర్​ బైక్​పై బోయిన్​పల్లికి వెళ్తున్నాడు.  

కండ్ల కోయ చౌరస్తా వద్ద లారీ స్పీడ్​ గా వచ్చి వెనక నుంచి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో మహేశ్​ కింద పడగా అతడి తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో స్పాట్​ లోనే మృతిచెందాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.