జీడిమెట్ల, వెలుగు : దీపావళి పండుగకు పటాకులు కొనడానికి వెళ్తూ ఓ యువకుడు యాక్సిడెంట్ కు గురై చనిపోయిన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... మెదక్కు చెందిన పి.మహేశ్(30)ఆదివారం దీపావళి పండుగకు పటాకులు కొనేందుకు తన పల్సర్ బైక్పై బోయిన్పల్లికి వెళ్తున్నాడు.
కండ్ల కోయ చౌరస్తా వద్ద లారీ స్పీడ్ గా వచ్చి వెనక నుంచి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో మహేశ్ కింద పడగా అతడి తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో స్పాట్ లోనే మృతిచెందాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.