అభివృద్ధి పనులపై ప్రధానిని కలుస్తున్నా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అభివృద్ధి పనులపై ప్రధానిని కలుస్తున్నా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించడానికి ప్రధాని మోడీని కలుస్తున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండలో కాలుష్యం కారణంగా మూసీ  పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతోందని..దీనిని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. నమామి మూసీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ప్రధానిని కోరనున్నారు. హైదరాబాద్, విజయవాడ హైవే గురించి ప్రధాని దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లనున్నారు.

మెట్రో, ఎంఎంటీఎస్‭కు సంబంధించి పలు అంశాలను కోమటిరెడ్డి ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశముంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన నేపథ్యంలో ప్రస్తుతం వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.