ఇండియా కూటమీ బీహార్ డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహాని..ఎవరీయన?

ఇండియా కూటమీ బీహార్ డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహాని..ఎవరీయన?

పాట్నా.:అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ లో  ప్రతిపక్ష ఇండియా బ్లాక్​ కూటమి సమరానికి సిద్దమవుతోంది. గురువారం ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను ఇండియా బ్లాక్​ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అదే సమయంలో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) చీఫ్ ముఖేష్ సహానిని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది. 

ఈ ప్రకటనతో బీహార్‌లో ఎన్నికల సమరానికి ప్రతిపక్షం సిద్ధమవుతోంది. వీరి ఎంపిక ద్వారా బీహార్​ లో అన్ని వర్గాల ప్రజలకు ప్రతినిధ్యం వహించే నేతలను బరిలోకి దించుతున్నట్లు సంకేతాలు పంపింది. తేజస్వి యాదవ్ అభ్యర్థిత్వం ఆర్జేడీ, మిత్రపక్షాల శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. మొదట ఇండియాకూటమితో విభేదించిన ముఖేష్​ సహాని మనసు మార్చుకుని కూటమితో చేతులు కలపడంతో ఆయనకు డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. 

మల్లా కుమారుడిగా ఫేమస్​ అయిన ముఖేష్​ సహానీ.. వికాస్​ షీల్​ ఇన్సాన్​ పార్టీ (వీఐపీ) చీఫ్. సంకీర్ణంలో తనకు తగిన చోటు లభించలేదని ఈ ఏడాది ప్రారంభంలో కూటమినుంచి బయటికి వెళ్లారు. అధిష్టానం ముఖ్య నేతల జోక్యంతో మళ్లి ఇండియా కూటమితో చేతులు కలపడంతో డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది ఇండియా కూటమి. 

ఎవరీ ముఖేష్​ సహాని..?

సినిమాలు ,టీవీ షోలకు సెట్‌లు వేస్తూ షో బిజినెస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన ముఖేష్​ సహాని.. ముఖేష్ సినీవరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు.  తర్వాత నితిన్​ దేశాయ్, ఉమాంగ్​ కుమార్లతో ఏర్పడిన పరిచయం బిజినెస్​ పార్టినర్​ షిప్​ వరకు వెళ్లింది. షారూఖ్​ ఖాన్​ నటించిన దేవదాస్​ సెట్స్​ వేసింది ఇతనే. 
బిగ్ బాస్ టీవీ షో కోసం ,సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ బర్జాత్య చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయో కోసం సెట్లు నిర్మించడంలో ముఖేష్​ సహాని కీరోల్ ఉంది. 

బిలియనీర్ ముఖేష్ అంబానీ కోసం డిజైనర్ సందీప్ ఖోస్లా ఏర్పాటు చేసిన షోకు కూడా పనిచేశాడు ముఖేష్​ సహాని. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వికాస్​ షీల్​ ఇన్సాన్​ పార్టీ (విఐపీ) పెట్టాడు. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే ఇండియా కూటమి తరపున బీహార్​ డిప్యూటీ సీఎం బరిలో ఉన్నారు. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు..

122 స్థానాలున్న బీహార్​ అసెంబ్లీ ఎన్నికలు రెండుదఫాలుగా జరగనున్నాయి. నవంబర్​ 6 న మొదటి దశ, నవంబర్​ 11న చివరి దశ ఎన్నికల పోలింగ్​ జరగనుంది. నవంబర్​  14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.