ఒకప్పుడు నా ఆస్తి, కేసీఆర్ ఆస్తి ఎంతో లెక్కలు తీయాలి

ఒకప్పుడు నా ఆస్తి, కేసీఆర్ ఆస్తి ఎంతో లెక్కలు తీయాలి

హుజురాబాద్ గడ్డ మీద కేసీఆర్ కు డిపాజిట్ వస్తే నేను బాధ్యత వహిస్తా అని అన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. చక్రవర్తుల, రాజుల చరిత్ర గురించి మన అందరికి తెలుసు..కానీ ఈ రాజు చరిత్ర నీచమైన చరిత్ర అని అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాట్లాడిన ఆయన.. ఉద్యమ సమయంలో నేను సంపాదించి ఇచ్చిన డబ్బు కాదా..అని ప్రశ్నించారు. ఒకప్పుడు నా ఆస్తి ఎంత.. కేసీఆర్ ఆస్తి ఎంత లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత భూమి అమ్ముకున్నది ఎవరో చెప్పాలన్నారు. కేసీఆర్ నియంత పాలన అంతం చేసేందుకు మన అందరం ముందఅడుగు వేయాలని కోరారు. రాజేందర్ గుర్తు కారు గుర్తు అని చెప్పుకుంటున్నారని..నీ ముఖం చెళ్లక నా పేరు చెప్పుకుంటున్నావంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల. 2023 ఎన్నికలకు జస్ట్ ఈ ఎన్నిక రిహార్సల్స్ లాంటిందన్నారు. 2023లో తెలంగాణ లో ఎగిరేది కాషాయ జెండా అని తేల్చి చెప్పారు ఈటల.