
షాద్ నగర్, వెలుగు: మాట్లాడితే తాను నల్లమల బిడ్డను అంటూ ప్రచారం చేసుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పశ్నించారు. శనివారం (June 14) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని బీజేపీ11 ఏండ్ల పాలనపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో కేసీఆర్ ఇక్కడ ఎంపీగా గెలిచి తాను పాలమూరు బిడ్డనని ప్రచారం చేసుకొని ప్రాజెక్టును ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకుపోలేదన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయననే అనుసరిస్తున్నారని విమర్శించారు. ఇద్దరు కుర్చీలు వేసుకుని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తామన్నారని, అప్పుడు కేసీఆర్కు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కుర్చీలు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.